శ్రీకాకుళం జిల్లాలో గురువారం వైయస్ జగన్ పర్యటనలో విధి నిర్వహణలో ఉన్న మహిళ ఎస్సై ప్రవల్లిక పై వైకాపా మూకలు దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆమెను పరామర్శించారు. దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆమె స్పష్టం చేశారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.