శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో బుధవారం కాశీబుగ్గ డిఎస్పి భవాని ఆధ్వర్యంలో "అభయం" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఉద్యమాల గడ్డగా పేరుగాంచిన బొడ్డపాడు ప్రజలు మీకోసం మీకుటుంబం కోసం ఒక్కక్షణం ఆలోచించాలని ఆమె తెలిపారు. హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, ఎస్సై సునీల్ సిబ్బందితోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.