శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్న ఆ నలుగురు సేవా సంస్థను స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే శిరీష ప్రారంభించారు. పలాస లేబర్ యూనియన్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ శిబిరంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని రక్తాన్ని దానం ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సేవలో అందిస్తున్న ఆ నలుగురు సంస్థ సభ్యులకు ఆమె అభినందించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.