శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... నాడు స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే నేడు మనకు జెండా పండుగ అని వారి త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శ్రీనివాసులు, కూటమి నాయకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.