"మధ్యవర్తిత్వం దేశం కోసం" కార్యక్రమంలో భాగంగా గురువారం పలాస జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలాస కోర్ట్ సివిల్ జడ్జి యు మాధురి మాట్లాడుతూ... మధ్యవర్తిత్వ చర్చల ద్వారా కేసులను సులభంగా, వేగంగా పరిష్కరించుకొని న్యాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.