శ్రీకాకుళం జిల్లా అండర్ - 19 బాలుర క్రికెట్ జట్టుకి పలాస కు చెందిన విద్యార్థి కొండెటి వర్ధన్ ఎంపికైనట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రకటించింది. విద్యార్థి ఎంపిక పట్ల తల్లిదండ్రులు, కోచ్ మన్యాల అవినాష్, మూర్తి, జగదీష్ తో పాటు జిల్లా క్రికెట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు, జంట పట్టణ వాసులు అభినందించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.