Skip to main content

లైంగిక నేరాలు నివారణకు అవగాహనే ఆయుధం : మధుర మీనాక్షి.

మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ గౌరవ సంచాలకులు గారి ఆదేశాల మేరకు, బాలల్లో లైంగిక నేరాలు నివారణకు అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

ఈ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నాడు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ శ్రీకాకుళం జిల్లా వారి ఆధ్వర్యంలో ఒప్పంగి యంపియుపి స్కూల్ నందు జిల్లా బాలల రక్షణ విభాగం అధికారి డి మధుర మీనాక్షి బాలల లైంగిక నేరాల నిషేధ చట్టం గురించి అవగాహన నిర్వహించి లైంగిక నేరాల నుండి బాలలు తమను తాము ఎలా కాపాడుకోవాలి, ఎలా జాగ్రత్త వహించాలి మరియు బాలలకి అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరి దగ్గర నుండి సహకారం తీసుకోవాలి, ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొనాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. అలాగే బాలల హక్కులు గురించి, గుడ్ టచ్- బ్యాడ్ టచ్, మై బాడీ మై రైట్ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్ గురించి అవగాహన కల్పించారు. 
మానసిక ఆరోగ్య సహాయానికి సంబంధించిన 14416 హెల్ప్‌లైన్, మహిళల సహాయార్థం 181 ఉమెన్ హెల్ప్‌లైన్, పిల్లల రక్షణ కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, అత్యవసర సేవల కోసం 112 పోలీస్ హెల్ప్‌లైన్ సేవల గురించి వివరించారు. అవగాహన సదస్సులో పాఠశాల హెడ్ మాస్టర్ ఎం విజయ వాణి మరియు ఇతర బోధన సిబ్బంది విజయభారతి,లక్ష్మీ పద్మజ , ఒప్పంగి 3 అంగన్వాడి కార్యకర్త జి భారతి విద్యార్థినులు పాల్గొన్నారు.

High Viewed News

పూండిలో కలకలం రేపిన బంగారం చోరీ...

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.

పలాసలో రైలు నుంచి జారిపడిన మహిళకు తీవ్ర గాయాలు

కలకత్తా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) రైలులో ప్రయాణం చేస్తూ... ఆదివారం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ జారిపడింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సత్యం & వెంకట్రావు ఘటన స్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స అందించి, వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ అస్సాం కు చెందిన అజ్వినా ఖాన్ గా గుర్తించి కేసు నమోదు చేసిన పలాస జిఆర్పి పోలీసులు.

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

SIR విధులకు అదనపు వేతనం ఇవ్వాలని వినతి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు అదనపు గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావుకు ఆదివారం కంప్యూటర్ ఆపరేటర్లు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. SIR విధుల్లో భాగంగా అదనపు పనిభారం, సాంకేతిక మరియు ఇతర కార్యనిర్వహణ సమస్యలు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. అదనంగా నిర్వహిస్తున్న విధులను పరిగణనలోకి తీసుకుని అదనపు గౌరవ వేతనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు సానుకూలంగా స్పందిస్తూ... తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సిమ్మన్న, హరి, కోదండ, సుధాకర్ తదితర ఎన్నికల కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.