శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణానికి చెందిన సూర్య తేజ విద్యా సంస్థలపై ఇటీవల అసత్య ఆరోపణలతో పలు పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ ప్రిన్సిపాల్ దానేటి పద్మజి హెచ్చరించారు. బుధవారం పలాసలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సూర్యతేజ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి పై చదువులకు వెళ్లిన విద్యార్థినిపై నాన్ టీచింగ్ స్టాఫ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆమె వివరించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.