శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామంలో సుమారు రూ. 21.2 లక్షల నిధులతో జేజేఎమ్ వాటర్ ట్యాంక్ పనులను గురువారం ఎమ్మెల్యే శిరీష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇంటింటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.