Skip to main content

Posts

Showing posts from December, 2025

కేవలం రెండు గంటల్లో బాలికను తల్లి వద్దకు చేర్చిన పోలీసులు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణానికి చెందిన లల్లిప్రియ నాయక్ అనే బాలిక స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. నేడు పాఠశాలకు వెళ్లనని ఇంట్లో మారాం చేసింది దీంతో తల్లి అనీషా నాయక్ మందలించడంతో బాలిక ఇంటినుంచి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా బాలిక జాడ తెలీకపోవడంతో తల్లి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సీఐ రామకృష్ణ ఆదేశాలు మేరకు రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు కేవలం రెండు గంటల్లో బాలికను ఆమె తల్లి వద్దకు చేర్చారు.

పలాసలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు తప్పనిసరి: సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస లో నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి 01:00 గంటలు వరకు మాత్రమే అనుమతి ఉందని కాశీబుగ్గ సిఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు. ఎవరైనా కల్చరల్ ప్రోగ్రామ్స్, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని కోరారు. రాత్రి వేళల్లో మద్యం మత్తులో వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు

పలాసలో ఘనంగా నిర్వహించిన వైకుంఠ ఏకాదశి వేడుకలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలాస ఉల్లాసపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ... నేడు ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకున్న పర్వదినమని తెలిపారు. ఇటీవల పలాసలో జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేసుకొని, పోలీసులు ముందస్తు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ఇక ఆర్టీసీ టికెట్స్ వాట్సాప్ లో బుకింగ్

ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌ కోసం బస్టాండ్‌కో.. నెట్‌ సెంటర్‌కో వెళ్లి సమయం వృథా చేసుకుంటున్నారా! అంత ప్రయాస అవసరం లేదండోయ్‌!! రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మనమిత్ర- వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సులువుగానే చేసుకునే అవకాశం ఉంది. ఈ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సిక్కోలు జిల్లాలో అదుపు తప్పిన పెట్రోల్ ట్యాంకర్.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లచ్చన్న పేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి వరద కాలువ లోకి దూసుకుపోయింది. లారీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ... క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

సిక్కోలు జిల్లాలో బయటపడ్డ నిత్య పెళ్లికూతురి యవ్వారం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వెలిసిన నిత్య పెళ్లికూతురు కేవలం 19 ఏళ్లకే - 8 పెళ్లిళ్లు.        పెళ్లికాని ప్రసాదులను - ముంచేస్తున్న ముత్తి రెడ్డి            ఈ లేడీ మాముల్ది కాదు బాబోయ్ పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ ఆమెకు మాత్రం పెళ్లి అంటే ఓ మూడు రోజుల ముచ్చట. అందుకే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు ఏకంగా ఎనిమిది మంది భర్తలను మార్చింది శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ మహిళ. చివరకు బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించటంతో ఆ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం బయట పడింది. ఇచ్చాపురం పట్టణంలోని కర్జీ వీధికి చెందిన ముత్తిరెడ్డి వాణి(19) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిత్య పెళ్లి కూతురుగా ఇపుడు ఆమె వార్తల్లోకి ఎక్కింది. తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట మగవారిని నమ్మించి మోసగించడం ప్రవృత్తిగా పెట్టుకుంది వాణి. పెళ్లి కానీ ప్రసాదులను ఎంచుకొని వారి నుంచి ఎదురు కట్నం తీసుకొని పెళ్లికి సిద్ధం అవుతుంది. తీరా పెళ్లయ్యాక వారం రోజుల్లోనే చెప్పచెయ్యకుండా పరారవుతుంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని దుర్గాదేవి ఆలయంలో కర్ణాటకక...

అభ్యుదయం సైకిల్ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరుతూ... పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారం పలాస కు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. పలాస ఇందిరా చౌక్ నుంచి కేటి రోడ్డు మీదుగా... వేలాదిమంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో.. అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాశీబుగ్గ డిఎస్పి షేక్ సహబజ్ అహ్మద్, సిఐ రామకృష్ణ, ఎస్సై నరసింహమూర్తి సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంక్రాంతి సెలవులు ఖరారు

ఏపీ లోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10వ తేదీ నుంచి 18 వరకు 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జనవరి 19న (సోమవారం) తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. కాలేజీల సెలవుల గురించి ప్రకటన రావాల్సి ఉంది. అటు తెలంగాణలోనూ స్కూళ్లకు ఇవే తేదీల్లో సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.

వృద్ధుల కోసం ఉచిత తిరుపతి బాలాజీ దర్శన పథకం ప్రారంభం

తిరుపతిలో వృద్ధుల కోసం ఉచితంగా బాలాజీ దర్శన పథకం ప్రారంభమయింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. 65 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులు ఈ పథకానికి అర్హులు. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులకు ఉచితంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఎస్ 1 కౌంటర్ వద్ద ఫొటో గుర్తింపు కార్డుు, వయస్సు ధృవీకరణ పత్రం చూపితే దర్శనానికి అనుమతిస్తరు. వంతెన కింద ఉన్న గ్యాలరీ గుండా దేవాలయం కుడిగోడ వెంబడి ముందుకు వెళ్లాలి. దర్శనానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. క్యూ లైన్లోకి వెళ్లాక 30 నిమిషాల్లో దర్శనం పూర్తవుతుంది. దర్శనానంతరం భక్తులకు ఉచిత భోజనంతో పాటు వేడి పాలు అందిస్తారు. సహాయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం హెల్ప్ డెస్క్ నంబర్ 87722 77777 ను సంప్రదించవచ్చు....

సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం ఉదయం చేపల వేటకు వెళ్లారు. తోటి మత్స్యకారులుతో కలిసి వేట సాగిస్తుండగా... ప్రమాదవశాత్తు మత్స్యకారుడు కర్రి విశ్వనాథం (34) పట్టు తప్పి సముద్రంలో పడిపోయాడు... ఇదే సమయంలో పడవకు ఉన్న ఫ్యాన్ అతను తగలడంతో తీవ్ర గాయాలతో విశ్వనాథం మృతి చెందాడు. తోటి మత్స్యకారులు ఆయన మృతదేహాన్ని అతి కష్టంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు సముద్ర తీరానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. విశ్వనాథం మృతదేహాన్ని చూసేందుకు సమీప ప్రాంత ప్రజలు వందలాదిమందిగా తీరానికి చేరుకున్నారు. మృతునికి భార్య ఈశ్వరితో పాటు 6, 9 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ రహదారిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం.

శ్రీకాకుళం జిల్లా నందిగాం(M) పెద్ద బాణాపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెళ్తున్న కారును వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో... కారు అదుపుతప్పి డివైడర్ పై నుంచి దూసుకుపోయి  లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో ప్రమాదానికి కారణమైన వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటనపై నదిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పలాసలో రూ.10 లక్షలతో పరారైన యువకుడు అరెస్టు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు బిడ్జ్ సమీపంలో ఈనెల 8వ తేదీన ఒడిస్సా కు చెందిన లొట్ల లక్ష్మయ్య వద్ద రూ. 10 లక్షలు అసలు నోట్లు తీసుకొని రూ. 50 లక్షలు బ్లాక్ మనీ ఇస్తున్నట్లు చెప్పి పుస్తకాలతో ఉన్న సంచి ఇచ్చి కారులో పరారైన విషయం తెలిసిందే... ఈ కేసులో పలాస కు చెందిన సునీల్ అనే యువకుడును ఆదివారం సాయంత్రం అమరావతి హోటల్ వద్ద అదుపులోకి తీసుకొని ఆయన వద్ద ఉన్న రూ. 4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు కాశిబుగ్గ సీఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకై పలాసలో భారీ ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర  భాగంగా... జంట పట్టణాలలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టిసి కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్ మీదుగా కాశిబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణ రంగంలో అవకాశాలు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పీరుకట్ల విఠల్రావు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, సీఐ రామకృష్ణ, సచివాలయ, మెప్మా సిబ్బందితోపాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉపాధి నిమిత్తం కాంతారావు తన కుటుంబంతోపాటు విశాఖలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి తన భార్య సంధ్య (37), కుమార్తె మహేశ్వరి (9) తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. సింహాచలం గోశాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కాంతారావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన తల్లి కూతురును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకున్న గుర్నాథ్ (11) అనాది అయ్యాడు.

ఫాస్టాగ్ పై కేంద్రం శుభవార్త.... ఇక నో టోల్ గేట్స్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ దేశంలోని అన్ని టోల్ గేట్‌ల వద్ద అందుబాటులోకి రానుంది. 2026 చివరి నాటికి దీన్ని అమలు చేయాలని ఉపరితల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. భవిష్యత్తులో ఏఐ, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ ద్వారానే టోల్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. టోల్ ఛార్జీల వసూళ్లు AI ఆధారిత వ్యవస్థల ద్వారానే జరుగుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నూతన టోల్ విధానం శాటిలైట్, AI సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో కూడా సునాయాసంగా దాటిపోవచ్చు. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టోల్ వ్యవస్థ ద్వారా 1,500 కోట్ల రూపాయల మేర ఇంధనం ఆదా అవుతుంది. ప్రభుత్వానికి అదనంగా రూ. 6,000 కోట్ల రూపాయలు సమకూరుతాయని నితిన్ గడ్కరీ అంచనా వేశారు. వాహనదారులు, కేంద్ర ప్రభుత్వానికి లాభదాయకంగా విన్ టు విన్ విధానంలో ఉంటుందని చెప్పారు. AI టోల్ కలెక్షన్లు మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో విధానం కింద పనిచేస్తుంది. జాతీయ రహదారులపై టోల్ బూత్‌లు ఉండవు. వాటి స్థానంలో గాంట్రీ గేట్స్ నిర్మితమౌతాయి. ఈ గాంట్రీ గేట్లపై హై రిజల్యూషన...

పలాసలో డి పట్టా భూముల్లో వివాదం

పలాసలో డీ పట్టా భూముల్లో వివాదం... గతంలో ఈ భూముల్లో ప్రభుత్వ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శంకుస్థాపన... మరి నేడు ఆ భూముల్లో వ్యాపారులు తగాదాలు. ప్రభుత్వ పోరంబోకు భూముల్లో వివాదాలకు కేంద్రంగా మారింది. కోట్లు విలువ చేసే భూములు కావడంతో ఒకరు నుంచి ఒకరు చేతులు మారి నేడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఆ భూముల్లో తగాదాలు పడుతున్నారు. గతంలో అప్పటి టిడిపి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు జిల్లా రెవెన్యూ అధికారులు శంకుస్థాపన కూడా చేశారు. నేడు ఆ భూముల్లో తమది అంటూ తమదని వ్యాపారులు తగాదాలు పడుతుండగా రెవెన్యూ అధికారులు తమకేమి సంబంధం లేదని చేతులు ఎత్తివేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.  పలాస మండలం కోసంగిపురం జంక్షన్ బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో సర్వేనెంబరు 67లో ఉన్న ప్రభుత్వ పోరంబోకుభూమి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది.  198 ఎకరాల భూమిలో 150 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సుడాకు అప్పగించి ప్రభుత్వ లేఅవుట్గా అభివృద్ధి చేస్తుండగా మిగిలిన భూమి అసెండ్గా మారి కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ భూమి చేతులు మారాలంటే ప్రత్యేకంగా కమిటీ వేసి వాటిని అందించాల్సి ఉంది...

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు... *ఢిల్లీ- ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై పొగ మంచు కారణంగా ఢీకొన్న బస్సులు నలుగురు మృతి పలువురికి తీవ్ర గాయాలు.  * TG: HYDలోని రవీంద్రభారతిలో SPB విగ్రహావిష్కరణ * ముగిసిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం * AP: ఆత్మార్పణ దినంగా పొట్టి శ్రీరాములు మరణించిన రోజు: CBN * కోటి సంతకాల ఉద్యమం విజయవంతం: జగన్ * క్రికెటర్ షెఫాలీ వర్మకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు * రెండు రోజుల పర్యటన కోసం జోర్డాన్ రాజధాని అమ్మాన్లో ల్యాండ్ అయిన PM మోదీ.. స్వాగతం పలికిన జోర్డాన్ పీఎం జాఫర్ హసన్.. ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పర్యటన * ఢిల్లీలో ముగిసిన ఫుట్బాల్ స్టార్ మెస్సీ పర్యటన.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్ను పలకరించిన మెస్సీ.. టీమ్ ఇండియా జెర్సీలు, INDvsUSA T20 WC టికెట్లు, బ్యాట్ను ప్రజెంట్ చేసిన ఐసీసీ ఛైర్మన్ జైషా * పొట్టి శ్రీరాములు వర్ధంతి.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు * పంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్కు సగం సీట్లు కూడా రాలేదన్న కేటీఆర్ * కాంగ్రెస్, సోనియా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్.....

పలాస టోల్ యాజమాన్యం తీరుపై ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేసిన టోల్ సిబ్బంది.

శ్రీకాకుళం పలాస టోల్ ప్లాజాలో నేటికీ చక్రం తిప్పుతున్న వైకాపాకు చెందిన టోల్ ఉద్యోగి (ఆ ముగ్గురు మొనగాళ్లు లో ఒకడైన) ఉప్పాడ ప్రసాద్ అని అక్కడ పని చేసే సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈయన మాట విని టోల్ యాజమాన్యం స్థానిక ఉద్యోగులపై తీవ్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ... శనివారం సుమారు 40 మంది టోల్ ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యే శిరీష వద్ద మొరపెట్టుకున్నారు. నేటికీ బ్రిటిష్ పరిపాలన విధంగా పలాస టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు.గతంలో ఓ దివ్యాంగుడు డొంకాన ధర్మారావు కు ఉద్యోగం తొలగిస్తే... ఆయన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే...! (ఇక్కడ ఉద్యోగం చేస్తున్న మరో ఇద్దరి మొనగాళ్లు చేసిన అరాచకాలు ఆధారాలతో త్వరలో మీ LMR NEWSNETWORK లో)...

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ పుష్కరాలపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తేదీల నిర్ణయానికి తిరుమల జ్యోతిష్య సిధ్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాలు మొత్తం 12 రోజులు  పుష్కరప్రవేశం: జూన్ 26, 2027 పుష్కర సమాప్తి: జూలై 7, 2027 కమిషనర్ గారి నివేదికపై ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్తర్వులు జారీ చేసిన దేవాదయ శాఖ ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డా.ఎం.హరి జవహర్లాల్

శబరిమలలో ఘోర ప్రమాదం... ఏపీ భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

కేరళ: శబరిమలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండదిగే సమయంలో అదుపుతప్పిన ట్రాక్టర్‌ భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఇతర భక్తులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. శబరిమల యాత్ర మార్గంలో భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

పలాసలో రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధి లేబర్ కాలనీలో మురుగు కాలువలు నిండి రోడ్లపై మురుగునీరు పారుతుంది. ఈ రోడ్డు దాటాలంటే సాహసమే చేయాలని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల పదోన్నతపై మున్సిపల్ కమిషనర్ గా విధుల్లో చేరిన శ్రీనివాసులు స్పందించి లేబర్ కాలనీలో మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

పొలంలోనే కాలి బూడిదైన వరి కుప్ప.

శ్రీకాకుళం జిల్లా పలాస(M) తర్లాకోట పంచాయితీ పరిధి గట్టూరు సమీప పొలంలో శనివారం మధ్యాహ్నం వరికుప్ప అగ్నికి ఆహుతి అయ్యింది. పొత్రియ గ్రామానికి రైతు సవర సుంకయ్య సుమారు ఎకరా పొలంలో కోతలు అనంతరం కుప్పగా వేశారు. శనివారం ఒక్కసారిగా మంటలను గమనించిన సమీప పొలాల్లో ఉన్న రైతులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అప్పు చేసి పొలంలో వ్యవసాయ పెట్టుబడి పెట్టానని ప్రభుత్వం తనను ఆదుకోవాలని సుంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

*ఏపీ: అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... లోయలో పడ్డ బస్సు 15 మంది యాత్రికులు మృతి. TG: ప్రశాంతంగా ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికలు * పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా * రాష్ట్ర బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ అసహనం * AP: రూ.20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం * కడప మేయర్ స్థానం వైసీపీ కైవసం * ప్రయాణికులకు ఇండిగో రూ.10 వేల ట్రావెల్ వోచర్లు * ఆరు రాష్ట్రాల్లో SIR గడువును పెంచిన ఈసీ * పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం * సీడ్ యాక్సెస్ రహదారి-NH16 అనుసంధాన పనులకు రూ.532కోట్లకు గ్రీన్ సిగ్నల్ * AP ప్రిజన్స్ &కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుకు ఓకే * రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం * SIPBలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ * కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం * రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు AP క్యాబినెట్ ఆమోదం * అమరావతిని శాశ్వత రాజధాని చేసేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడతాం: కేంద్రమంత్రి పెమ్మసాని * తెలంగాణలో ముగిసిన పంచాయతీ తొలి విడత ఎన్నికలు * TGలో ఇంటర్ వరకు ఒకే బోర్డు ఉండేలా విద్యా శాఖ చర్యలు * ...

పలాసలో నందమూరి అభిమానుల సందడి.

శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాసలో ఎంతో ఉత్కంఠ ంగా చూస్తున్న నందమూరి అభిమానులకు నిరాశ మరోసారి ఎదురైనట్లు కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా ఇప్పటికే రెండుసార్లు పలు కారణాల చేత వాయిదా పడిన విషయం తెలిసిందే... నేడు ప్రీమియర్ షో వేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లభించడంతో... పలాస శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ వద్దకు నందమూరి అభిమానులు భారీగా చేరుకున్నారు. రాత్రి 10 అవుతున్న సినిమా హాల్ గేట్లు తెరవకపోవడంతో అ ప్రాంతం ఉద్రిక్తతగా మారింది.

ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం.

44 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు ప్రాజెక్టులు. అమరావతిలో లోక్‍భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీసు, గెస్ట్ హౌస్‍లు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం. రూ.532 కోట్లతో సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధాన పనులకు ఆమోదం. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతులు. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్‍లుగా పదోన్నతికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

నెహ్రూ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో ఉన్న నెహ్రూ పార్క్ (ముత్యాలమ్మ కోనేరు) అభివృద్ధి పనులను గురువారం ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జంట పట్టణాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక నెహ్రూ పార్కును కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే కోనేరుకు నాలుగు వైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, టిడిపి నేతలు గాలి కృష్ణారావు, డొక్కరి శంకర్, సప్ప నవీన్, యవ్వారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళా అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే శిరీష

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మహాజన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తోందని, అందుకు అనుగుణంగా సీఎం చంద్రబాబు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో బ్యాంకుల ద్వారా సబ్సిడీ పై ఆర్థిక పెట్టుబడి అందిస్తున్నారని గుర్తు చేశారు.

పలాసలో త్వరలో ప్రారంభం కానున్న కేంద్రీయ విద్యాలయ తరగతులు: ఎమ్మెల్యే శిరీష

పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర బృందంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం తాత్కాలిక భవనమైన రైల్వే పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏప్రిల్ 2026 నుంచి తాత్కాలిక భవనంలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మరో రెండు సంవత్సరాల్లో కేంద్ర విద్యాలయ పనులు పూర్తిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పలాస ఆర్ఆర్ కాలనీలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహేంద్ర తనయ ఆప్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల కాలనీలో సుమారు రూ. 7.61 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలలో మౌలిక వసతులను వైకాపా ప్రభుత్వం విస్మరించిందని, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్ ఆర్ కాలనీలలో మౌలిక వసతులపై దృష్టి సారించామని తెలిపారు.

సోంపేట పట్టణంలో 30 తులాల బంగారం చోరీ.

శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ భారీ చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోర్టు వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 30 తూలాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

కాశీబుగ్గ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన వై రామకృష్ణ

కాశీబుగ్గ టౌన్ సీఐ గా వై రామకృష్ణ ఆదివారం విధుల్లో చేరారు. కాగా ఈయన ఇదే పోలీస్ స్టేషన్ లో 09-11-2013 నుంచి 19-06-2016 వరకు సీఐ గా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే... విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ కళాశాల నుంచి కాశీబుగ్గ స్టేషన్ లో సీఐ గా విధుల్లో చేరారు. ఇదే స్టేషన్లో సిఐ గా విధులు నిర్వహిస్తున్న సూర్యనారాయణ విఆర్ కు రిపోర్ట్ చేసినట్లు సమాచారం.