Skip to main content

Posts

Showing posts from November, 2025

దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ పోరులో.. భారత్ గెలుపు

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ప్రత్యర్థిపై టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్ల వద్ద 332 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ (72), యాన్సన్(70), బాష్(67) కంగారు పెట్టినా.. గెలుపు భారత్ వశమైంది. హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్లో రికెల్టన్(0), డికాక్(0) వెనువెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత మార్క్రమ్(7) ఐదో ఓవర్లో అర్ష్దీప్ బౌలింగ్లో కీపర్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అప్పటికే క్రీజులో ఉన్న మాథ్యూ.. డిజార్జి(39)తో కలిసి నాలుగో వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 15వ ఓవర్లో డిజార్జి.. కుల్దీప్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రెవిస్ (37) 22వ ఓవర్లో హర్షిత్ వేసిన బంతిని సిక్స్ మలిచే క్రమంలో రుతురాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన యాన్సన్ దూకుడుగా ఆడుతూ.. మాథ్యూకి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పారు. అయితే, 34వ ఓవర్లో కుల్దీ...

సైక్లిస్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరికి తీవ్ర గాయాలు.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సున్నాడ గ్రామ జంక్షన్ సమీప రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడుకు తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించగా.. మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి వైద్యులు తరలించారు.

8 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను పట్టుకున్న స్థానిక మత్స్యకారులు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల (M) డి మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆదివారం బంగ్లాదేశ్ కు చెందిన 8 మంది మత్స్యకారులను పట్టుకున్నారు. సముద్రంలో చేపల వేట లేకున్నా ఒక పడవపై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తులను స్థానిక మత్స్యకారులు గమనించి, వెంటనే మరో పడవలో సముద్రంలోకి వెళ్లి వారిని పట్టుకున్నారు. అనుమానాస్పద రీతిలో సమాధానం చెబుతుండడంతో... 8 మంది మత్స్యకారులను ఎచ్చెర్ల పోలీసులకు అప్పగించారు.

తిరుపతిలో రూ.50వేల ఇంజెక్షన్ ఫ్రీ 💉

బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరం. చికిత్సకు రూ.లక్షలు ఖర్చు చేయాలి. తిరుపతి రుయాలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మంగళ, శుక్రవారం న్యూరాలజీ OP ఇస్తారు. అత్యవసర వైద్యం 24గంటలు అందిస్తారు. చేయి, కాలు, మాట పడిపోవడం, మూతి వంకర పోవడం, కళ్లు కనిపించకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. సకాలంలో గుర్తించి ఇక్కడికి తీసుకొస్తే రూ.50వేల విలువైన ఇంజెక్షన్ వేస్తారు. 90శాతం ప్రాణాపాయం తప్పుతుంది.

పలాసలో కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి వేసిన వడ్డీ వ్యాపారి

శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాసలో పలువురు వ్యాపారులుకు కుచ్చుటోపి వేసి కోట్లాది రూపాయలుతో ఉడాయించిన ఓ ప్రైవేట్ సంస్థ యాజమాని. ఇటీవల కాలంలో పలాసకు చెందిన సంస్థ యాజమాని గుండె పోటుతో మృతి చెందగా... ఆయన బిజినెస్ పార్ట్నర్ ఉడాయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థలో అధిక వడ్డీలకు ఆశబడి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక సమాచారం. మరిన్ని పూర్తి వివరాలతో మళ్లీ మీ ముందుకు LMR NEWS NETWORK లో....

గ్రామ సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా మందస మండలం నర్శింగుపురం,  జిల్లుండా గ్రామ సచివాలయాలను స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించి, సిబ్బందిని సమయాపాలన పాటించాలని తెలిపారు. వివిధ సమస్యలపై సచివాలయం కు వచ్చిన ప్రజలకు అందుబాటులో ఉంటూ... ప్రజల యొక్క వినతులను స్వీకరించి సకాలంలో వారి సమస్యలను పూర్తిచేయాలని ఆమె తెలిపారు.

గంజాయి స్మగ్లర్ గా మారిన గ్యాస్ డెలివరీ బాయ్...

హైదరాబాద్‌ : గంజాయి సరఫరా చేస్తున్న గ్యాస్‌ డెలివరీ బాయ్‌ను ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లికి చెందిన గాదె అజయ్‌ (21) గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇంటింటికీ వెళ్లి గ్యాస్‌ సిలిండర్లు వేయడం ద్వారా వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి సరఫరా చేయడాన్ని ప్రారంభించాడు. గంజాయి తాగేవారు ఆర్డర్‌ చేస్తే అజయ్‌  నేరుగా వారి ఇంటికెళ్లి అందజేస్తున్నాడు. ఈ క్రమంలో కూకట్‌పల్లి ఇస్తావా హోమ్స్‌ ప్రాంతంలో గంజాయి అమ్మకం జరుగుతుందన్న పక్కా సమాచారం అందడంతో నిఘా పెట్టిన ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది గంజాయి విక్రయిస్తున్న అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి అతడి వద్ద ఉన్న 580 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని కూకట్‌పల్లి ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

రైతన్న మీకోసం వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా మందస(M) కొండలోగాం గ్రామంలో శనివారం నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చివరి భూములకు సాగు నీరు కూటమి ప్రభుత్వంలో అందించామని, మార్కెట్లో గిట్టుబాటు ధర ఉన్న పంటలను గిరిజనులు సాగు చేయాలని ఆమె కోరారు. కూటమి ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ము జామ చేస్తుందని ఆమె తెలిపారు.

డబ్బు కోసమే తప్పు చేశా.. ఇకపై పైరసీ జోలికి వెళ్లను: ఐబొమ్మ రవి

పైరసీ సినిమాల కేసులో అరెస్టయిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. శుక్రవారంతో రెండో రోజు విచారణ ముగియగా, ఉదయం నుంచి మౌనంగా ఉన్న రవి మధ్యాహ్నం తర్వాత పెదవి విప్పినట్లు సమాచారం. విదేశీ పౌరసత్వం ఉండటంతో పైరసీ గుట్టు బయటపడినా చట్టం నుంచి సులభంగా తప్పించుకోవచ్చని భావించినట్లు రవి అంగీకరించినట్లు తెలిసింది. గత ఆరేళ్లుగా తనను ఎవరూ పట్టుకోలేకపోవడంతో, అదే ధీమాతో తన నెట్‌వర్క్‌ను దేశ, విదేశాల్లో బలోపేతం చేశానని విచారణలో వెల్లడించాడు. "మొదట్లో కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో చేశాను. చేస్తున్నది తప్పని గుర్తించలేకపోయాను" అంటూ పోలీసుల ఎదుట పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చాక పూర్తిగా మారిపోతానని, మళ్లీ పైరసీ జోలికి వెళ్లనని పోలీసులను వేడుకున్నట్లు తెలిసింది. మరోవైపు, ఈ కేసులో పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రవికి దేశ, విదేశాల్లో ఉన్న ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు.

14 ఏళ్లకే ప్రేమ, జంప్.. ఎందుకిలా?

విజయవాడకు చెందిన బాలిక(14), బాలుడు (13) ఇంటి నుంచి పారిపోవడంపై నెటిజన్లు షాకవుతున్నారు. అంతచిన్న వయసులో ఇలాంటి ఆలోచన, ధైర్యం రావడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియా వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. బుధవారం బాలుడు తన తండ్రి ఫోన్, రూ. 10వేలు తీసుకుని అమ్మాయితో హైదరాబాద్ వచ్చాడు. తుక్కుగూడలో రూమ్ కోసం వెతుకుతుండగా ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పేరెంట్సు అప్పగించారు.

ఇక నాన్-ఏసీ కోచ్ ల్లోనూ దుప్పటి, దిండు.

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

పలాసలో గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న మందస, వజ్రపుకొత్తూరు, పలాస రూరల్ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే వద్ద విన్నవించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ... మరికొన్ని సమస్యలపై అక్కడికక్కడే ఆమె అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు.

స్పీడు పెంచితే వాహనం సీజ్...

ఏపీలో రోడ్డు ప్రమాదాల లెక్కలు టెర్రర్ పుట్టిస్తున్నాయి.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందారు. ఈ వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇందులో మూడో వంతు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరిగినవే. 53 శాతం మేర ప్రమాదాలు కార్లు, ద్విచక్ర వాహనదారుల సెల్ఫ్ యాక్సిడెంట్లు ఉన్నాయి. రహదారి ప్రమాదాల్లో ఏపీ దేశంలో 8వ స్థానంలో ఉంది. నెల్లూరు, తిరుపతి, పలనాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉంది. వాస్తవానికి ఓవర్ స్పీడ్ కారణంగా 79 శాతం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 3 శాతం, మద్యం, మొబైల్ ఫోన్ల కారణంగా 1 శాతం చొప్పున ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులపై 42 శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే రాష్ట్ర రహదారుల పై 21 శాతం మేర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో పై అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. వారికి సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ప్రతీ రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలన్నారు....

ప.గో: సైబర్ వల.. వీరే వారి టార్గెట్...

పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ78 లక్షలు కాజేసిన కేసులో 13 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. విచిత్రంగా, విద్యావంతులు కూడా ఈ వలలో చిక్కుకోవడం గమనార్హం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొట్టివేయవద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆమె నేరం చేశారా లేదా అనేది సీబీఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని, అందువల్ల ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అనుమతించరాదని స్పష్టం చేసింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని గుర్తుచేశారు. అనుమతి ఇచ్చారా లేదా అన్నదే ముఖ్యం కానీ, ఎప్పుడు ఇచ్చారనేది కాదని పేర్కొన్నారు. ఈ కేసు నేరుగా లంచం తీసుకున్న వ్యవహారం కాదని, ఇది నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించినదని కోర్టుకు వివరించారు. అయితే, శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదిస్తూ ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. పాత నేరానికి కొత్తగా సవరించిన ...

ఇప్పట్లో పెళ్లి ముహూర్తాలు లేనట్లే...!

పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి ముహూర్తాల కష్టాలు మొదలయ్యాయి. *దాదాపు 3 నెలల వరకూ మంచి ముహూర్తాలే లేవంటున్నారు పండితులు.* ఇందుకు కారణం శుక్ర మూఢమే. 2026 ఫిబ్రవరి 18 వరకూ మంచి రోజుల కోసం వేచి చూడాల్సిందేనని చెప్తున్నారు. మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ మాసం బహుళ అమావాస్య వరకు.. అంటే నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకూ 83 రోజులపాటు మౌఢ్యమి ఉంటుందని, అప్పటి వరకూ శుభ ముహూర్తాలు లేవని పేర్కొన్నారు. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చే కాలాన్ని మూఢంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రెండు గ్రహాలు బలంగా ఉండవని, అందుకే వివాహం, నూతన గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు వంటి కార్యక్రమాలు నిర్వహించరు. కాగా.. తప్పనిసరిగా చేసే పనులు, నిత్యకర్మలకు మూఢమి వర్తించదు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్స్ ఏవీ ఖాళీ ఉండేవి కాదు. కానీ ఈసారి మాఘమాసంలో మూఢమి ఉండటంతో పెళ్లి ముహూర్తాలు కూడా లేక బుకింగ్స్ లేవని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వాపోతున్నారు.  పెళ్లి ముహూర్తం కోసం మూడు నెలలు ఆగాలి.

వైట్ ఎగ్సు రంగేసి నాటుకోడి గుడ్లంటూ...!

ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.

శ్రీకాకుళం జిల్లా నందిగాం (M) లట్టిగాం గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన బొమ్మాళి సుదర్శన్ తన కుమార్తెతో కలిసి హరిదాసుపురం వెళ్లేందుకు లట్టిగాం వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా... పలాస నుంచి కోటబొమ్మాలి వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుదర్శన్ కు తీవ్ర గాయాలు కాగా... ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం టెక్కలి ఆసుపత్రికి తరలించగా... ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సుదర్శన్ ను శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఇంటర్ విద్యార్థినిని గర్భవతి చేసిన యువకుడి పై పోక్సో చట్టం పై కేసు నమోదు.

గుంటూరు నగరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడిపై పట్టాభిపురం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం, అచ్చంపేట మండలం క్రోసూరుకు చెందిన బాలిక గుంటూరు నగరంలో బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన తిరుపతయ్య అనే యువకుడు ఆమెను నమ్మబలికించి లాడ్జికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేయడంతో బాలిక గర్భవతైనట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారితమైంది. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలికకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

పలాసలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాతపట్నం కు చెందిన ఇద్దరు యువకులు మృతి

శ్రీకాకుళం జిల్లా పలాస (M) గరుడఖండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన విషయం తెలిసిందే.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు పాతపట్నం మండలం సరళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు, తలగాపు వేణు గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు సుశాంత్ (23)  ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్ ద్రమగిరి బ్లాక్ డేరబా గ్రామానికి చెందిన యువకునిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడకండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ఘటన స్థలంలో మృతి చెందగా... మరో యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కాశిబుగ్గ ఎస్సై నరసింహమూర్తి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు భూమి పూజ

అమరావతి కృష్ణా నదీ తీరాన శ్రీ వెంకటేశ్వర ఆలయ విస్తరణకు నేడు భూమిపూజ – రూ.260 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి అమరావతి: అమరావతిలోని కృష్ణానది తీరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేడు భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 3 వేల మంది భక్తులు హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా యంత్రాంగం వెల్లడించింది. ఆలయ ప్రాకారం నిర్మాణం, ఏడంతస్తుల రాజగోపురం, సేవామండపం, రథమండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ, పుష్కరిణి అభివృద్ధి, భక్తుల విశ్రాంతి భవనాల నిర్మాణం వంటి కీలక పనులు ఈ ప్రాజెక్టులో చేపట్టనున్నారు. భక్తుల సౌకర్యాలు, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ఆలయ సముదాయాన్ని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యాక అమరావతి ప్రాంతం మరో ప్రధాన తీర్థక్షేత్రంగా మారనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది

మైనర్ల ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషకం ఇవ్వబడును.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ... కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రవేట్ పాఠశాల నందు చదువుతున్న ఇద్దరు పిల్లలు నిన్న సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్ళవలసిన వారు ఇంటికి వెళ్ళలేదు.కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికిన అనంతరం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. పైన తెలిపిన పిల్లలు ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది తెలిపిన అధికారులకు సమాచారం తెలియజేయగలరు. కృష్ణ లంక ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్.వి.వి.నాగరాజు 9440627086. సౌత్ ఏ.సి.పి. శ్రీ డి.పావన్ కుమార్ గారు - 9440627045 ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషకం ఇవ్వడం జరుగుతుంది.

ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడ్డ ఎస్సై భాను ప్రకాష్

* ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ భాను ప్రకాష్. * 2018 నుండి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టిన భాను ప్రకాష్  * ఏపీ - రాయచోటికి చెందిన భాను ప్రకాష్.. అంబర్‌పేట్ పీఎస్‌లో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐగా విధులు నిర్వహణ. * ఏపీలో ఎలక్ట్రిక్ ఏఈ ఉద్యోగం వచ్చిందని రిలీవ్ చేయాలని కోరిన భాను ప్రకాష్.. వెపన్ డిపాజిట్ కోరడంతో బయటపడ్డ ఉదంతం. * ఓ దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న 4.3 తులాల బంగారాన్ని ఓ దుకాణంలో కుదువ పెట్టిన భాను ప్రకాష్. * లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమై, యజమాని బంగారం తిరిగి అడగగా, కనిపించడం లేదని చెప్పిన ఎస్ఐ. * దీంతో విచారించి ఆ దుకాణం నుండి బంగారాన్ని రికవరీ చేసి, భాను ప్రకాష్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు. * 2018 నుండి బెట్టింగ్‌లకు అలవాటై భాను ప్రకాష్ రూ.కోటిన్నర పోగొట్టినట్లు, ఈ క్రమంలోనే సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టినట్లు తెలిపిన పోలీసులు.

శ్రీవారి భక్తులకు శుభవార్త.

 తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు 10 రోజులు ఉంటుంది. భక్తులకు ఈసారి డబుల్ బోనాంజా లభించనుంది. సర్వదర్శనం టోకెన్లు కూడా ఆన్లైన్ విధానంలోనే జారీ చేస్తారు. ఆన్లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా ఉచిత సర్వదర్శనం టికెట్లు పొందవచ్చు. గతంలో జరిగిన తొక్కిసలాట కారణంగా టీటీడీ ఈ విధానాన్ని మార్చింది.

పాదరసం ఇంజక్షన్ ఇచ్చి భార్యను చంపిన భర్త.

బెంగళూరులో ఓ భర్త ఎవరూ ఊహించని విధంగా తన భార్యను చంపాడు. పాదరసం ఇంజెక్ట్ చేసి.. 9 నెలలు నరకం చూపించాడు. దీని కారణంగా ఈ తొమ్మిది నెలల కాలంలో ఆమెలోని ఒక్కో అవయవం పాడవుతూ వచ్చింది. చివరకు ప్రాణాలు కోల్పోయింది. అయితే చనిపోవడానికి ముందే తన భర్త తనకు చేసిన అన్యాయం గురించి వివరించింది. అలాగే తన భర్తకు పాదరసం, సిరంజిలు, క్లోరోఫామ్‌ను ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అందించారని పేర్కొంది. విద్య ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా భర్త బసవరాజు పై కేసు నమోదు చేశారు. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు.

చెట్టు కోసం 363 మంది ప్రాణాలు కోల్పోయారు...!

రాజస్థాన్ రాష్ట్ర వృక్షమైన హేబ్రీ చెట్టు ఉనికి వెనుక వందల మంది ప్రాణత్యాగం ఉందనే విషయం తెలుసా? 1730లో జోధ్ పూర్ రాజు అభయ్ సింగ్ ప్యాలెస్ నిర్మాణానికి కలప సేకరించాలని సైనికులను పంపారు. ఇది తెలుసుకున్న బిష్ణోయ్ కమ్యూనిటీ సైనికులను అడ్డుకుంది. చెట్టును కౌగిలించుకుని నరకొద్దని కోరింది. సైనికులు వినకుండా 363 మందినీ నరికేశారు. ఇది తెలుసుకున్న రాజు చలించి చెట్లను నరకొద్దని ఆదేశించడంతో ఆ చెట్టు బతికింది

శబరిమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ...!

శబరిమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది.వారం క్రితం మాదిరిగా శబరిమల సన్నిధానంలో ఇసుకేస్తే రాలనంతగా అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. దీంతో.. అయ్యప్పస్వామి దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోంది. మండల పూజ సీజన్లో భాగంగా ఈనెల 16న శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా.. తొలి నాలుగు రోజుల్లో రికార్డుస్థాయిలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. వారంరోజుల్లో ఆరున్నర లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు.

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం – హైరిస్ భవనాల్లో చిక్కుకున్న పలువురు

హాంకాంగ్‌లోని తై పొ (Tai Po) ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పలు హైరిస్ నివాస భవనాలను మంటలు చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి ఫైర్ సర్వీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం, ఈ భవనాల్లో ఇంకా పలువురు చిక్కుకుని ఉన్నారు. సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు అధికారికంగా వెల్లడికాలేదని అధికారులు తెలిపారు. ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసి, సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

apk ఫైల్ తో జాగ్రత్త సుమా...!

బిగ్ అలెర్ట్....  సైబర్ నేరగాళ్లు మీ వాట్సాప్ కు Apk ఫైల్ ను పంపుతారు. Apk అని ఉండే ఏ ఫైల్స్ ని కూడా ఎటువంటి పరిస్థుతులలో ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే మీ ఫోన్ డేటా పోవడమే కాకుండా మీకు తెలియకుండా మీ ఫోన్ ను సైబర్ నేరస్తులు ఆపరేట్ చేస్తారు. మీ ఫోన్లో ఉన్న డాటా, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగిలించ బడతాయి జాగ్రత్త.  ఉదాహరణకు : RTO CHALLAN.apk Aadhar.Apk SBI.Apk pm kisan.Apk Unions Bank.Apk Cse.Apk Statebank.Apk Ekyc apk ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ కి గురవుతుంది. ఈ ఫైళ్లని డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తగా డిలీట్ చేయండి. ఏదైనా మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే బ్యాంకు ఖాతా స్తంభింపజేయాలి. 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.

వాడివేడిగా మాక్ అసెంబ్లీ.. వారిని మార్షల్స్ ఎత్తి బైటేశారు!

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో మాక్‌ సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలాగౌతమ్‌, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు. డిప్యూటీ సీఎం గా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, అసెంబ్లీ స్పీకర్ గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి ఉన్నారు. అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. 45 వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం చేశారు. విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్న తన ఆలోచనని మంత్రి లోకేష్ ఇటీవల అసెంబ్లీలో ప్రతిపాదించగా సభ్యులంతా మద్దతు తెలిపారు. దాంతో వివిధ స్థాయిలలో విద్యార్థులకు పలురకాల పోటీలు పెట్టి నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్కరిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మాక్ అసెంబ్లీ లో వాడి వేడిగా చర్చ జరిగింది. ఒలింపిక్స్ చర్చపై అధికార మరియు ప్రతి...

నెల్లూరులో దారుణ హత్యకు గురైన టిడిపి నేత...!

నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో టిడిపి నేత ఆధ్వర్యంలో గొట్టిపాటి ప్రసాద్ ను దుండగులు కత్తితో గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డారు. గ్రామ శివారులోని తన కోళ్ల ఫారంలో గొట్టిపాటి ప్రసాద్ పని చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

రేపటి నుంచి ఈ పనులు చేయకూడదట...!

రేపటి నుంచి ఫిబ్రవరి 17వరకు శుక్ర మౌఢ్యమి ఉందని పండితులు తెలిపారు. 'శుభాలకు అధిపతులైన గురు, శుక్రుడు ఈ మూఢాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతారు. మొత్తం 84రోజులు ఈ శుక్ర మౌఢ్యమి కొనసాగనుంది. ఈ రోజుల్లో పెళ్లి, యాత్రలు, పుట్టు వెంట్రుకలు తీయడం, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, బోర్లు తవ్వించడం వంటివి చేయొద్దు. నిత్యారాధన, సీమంతాలకు ఈ దోషం వర్తించదు' అని పండితులు చెబుతున్నారు.

26/11 ముంబై పాకిస్తాన్ ఉగ్రదాడి...

2008 నవంబర్ 26 సాయంత్రం, భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై ఎప్పటిలాగే తన పనిలో నిమగ్నమై ఉంది. కానీ ఆ రాత్రి చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. పాకిస్తాన్ నుండి వచ్చిన 10 మంది ఉగ్రవాదులు ముంబై నగరంలో ప్రవేశించి, 60 గంటల పాటు మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.   *1. ఉగ్రవాదుల ప్రవేశం మరియు దాడి ప్రారంభం:*  పది మంది ఉగ్రవాదులు 'అల్ హుస్సేనీ' అనే నౌక నుండి, 'కుబేర్' అనే భారతీయ పడవను హైజాక్ చేసి ముంబై తీరానికి చేరుకున్నారు. వారు ముంబైలోని బధ్వార్ పార్క్ వద్ద స్పీడ్ బోట్ ద్వారా దిగారు. వారి ప్రవర్తన చూసి స్థానిక మత్స్యకారుడు భరత్ తమోరేకు అనుమానం వచ్చినప్పటికీ, అది పట్టించుకోబడలేదు. అక్కడ నుండి వారు రెండు రెండు బృందాలుగా విడిపోయి తమ లక్ష్యాలైన CST రైల్వే స్టేషన్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్ మరియు ఒబెరాయ్ ట్రైడెంట్ వైపు వెళ్లారు.   *2. దాడుల పరంపర:*  - *ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST):* అజ్మల్ కసబ్ మరియు ఇస్మాయిల్ ఖాన్ అనే ఇద్దరు ఉగ్రవాదులు స్టేషన్‌లో ప్రవేశించి AK-...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు పలాస వాసులు మృతి

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు మృతి. నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయ్యప్ప మాలదరించి 6 గురు యువకులు శబరిమలై వెళ్లి అక్కడ నుంచి రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్ (24), పైడి సాయి (26) గా పోలీసులు గుర్తించారు.

కలకలం రేపిన రైలు పట్టాలపై మృతదేహం.

శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించి భయాందోళన చెందుతూ.. పలాస జిఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.

అబుదాబిలో సిక్కోలు మత్స్యకార యువకుడు అనుమానాస్పద మృతి

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం(M) డొంకూరు గ్రామానికి చెందిన బడే చంటి (22) అబుదాబి లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అబుదాబిలో వెల్డింగ్ పనులు చేస్తూ... చంటి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కంపెనీ యాజమాని మృతుని కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తూ... తమ కుమారుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వ విప్ అశోక్ బాబు కు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు కోరారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.

బంగాళాఖాతంలో వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడనుంది. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఉంది, ఇది నవంబర్ 27 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 29వ తేదీ నుంచి ఏపీలోని కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రేపటి నుంచి వైకుంఠ ఏకాదశి టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం

వైకుంఠ ఏకాదశి దర్శనాలకు నవంబర్ 27 నుంచి టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 2న లక్కీడిప్ ద్వారా మొదటి మూడు రోజులకు టికెట్లు కేటాయించబడతాయి. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేశారు.

కూటమి ప్రభుత్వంలోనే యువతకు ఉపాధి: ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండల పరిధిలో మంగళవారం పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి అభి యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడం శుభదాయకమని కొనియాడారు. అనంతరం పరిశ్రమంలో యంత్రాల పనితీరును ఆమె స్వయంగా పరివేక్షించారు. రాబోయే రోజుల్లో వ్యాపార అభివృద్ధి మరింత వ్యాప్తి చెంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఆమె కోరారు.